Sai Pallavi construction of the hospita: ఆస్పత్రి నిర్మాణంలో బిజీగా ఉన్న సాయి పల్లవి... ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి ఆఖరి సినిమా విడుదల కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తన తదుపరి సినిమాల గురించి ఏ విధమైనటువంటి ప్రకటన వెలువడ లేదు.

ఇలా చాలా నెలలుగా చిత్ర పరిశ్రమకు సాయి పల్లవి దూరంగా ఉంటున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఈమె తన గురించి తన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి ఏమాత్రం ప్రకటించకపోవడంతో ఎంతోమంది సాయి పల్లవి ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటున్నారని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరికొందరు సాయి పల్లవి ఇకపై సినిమాలలో నటించర అంటూ సందేహాలను వ్యక్తపరచగా మరికొందరు మాత్రం సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలను పుట్టించారు.

అయితే సాయి పల్లవి సినిమాలలోకి రాకముందు ఒక డాక్టర్ అనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు సినిమాలలో నటించిన ఈమె ఎట్టకేలకు తన డాక్టర్ కోర్స్ పూర్తిచేసి డాక్టర్ పట్టా అందుకున్నారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి తనకు నచ్చిన పాత్రలలోనే సినిమాలు చేస్తానని అలాంటి పాత్రలు రాకపోతే తాను తన వైద్య వృత్తిని కొనసాగిస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె సినిమాలు చేయకపోవడానికి కారణం ఆమె తన వైద్య వృత్తిలో స్థిరపడాలని భావిస్తున్నారట.ఈ క్రమంలోనే ఆసుపత్రి నిర్మాణంలో సాయి పల్లవి బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

Advertisement

కోయంబత్తూరులో హాస్పిటల్ నిర్మించి ఈమె ప్రజలకు సేవ చేయాలని ఎప్పటినుంచో కలలు కంటున్నారు.ఈ క్రమంలోనే ఆసుపత్రి నిర్మాణం కోసం కావాల్సిన అనుమతులు తీసుకోవడానికి ఈమే పలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తోంది.

వీలైనంత తొందరగా ఆస్పత్రి నిర్మించే దిశగా సాయి పల్లవి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు