మొదలవ్వబోతున్న రిపబ్లిక్ హంగామా..!

మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.చేసింది కొద్దీ సినిమాలు అయినప్పటికీ తన నటనతో ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు తేజ్.

అయితే గత కొద్దీ రోజులుగా తన సినిమాలు ప్లాప్ అవ్వడంతో రేసులో కొద్దిగా వెనుక పడ్డాడు.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు.

దేవ కట్టా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.

Advertisement

అయితే ఎట్టకేలకు ఈ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించారు.

పంజా అభిరామ్ గా ఈయన పాత్రను కూడా రివీల్ చేసారు చిత్ర యూనిట్.ఈ సినిమాలో టెక్ కలెక్టర్ పాత్రలో నటిస్తూ పొలిటికల్ వ్యవ్యస్థపై పోరాటం చేయబోతున్నట్టు తెలుస్తుంది.

తేజ్ కొత్త పాత్రలో కనిపించ బోతున్నాడు .అందుకే ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.అంతేకాదు ఈ సినిమాలో తేజ్ నటన పరంగా పూర్తి న్యాయం చేసాడట.

అయితే విడుదలకు ిన చాలా సమయం ఉండడంతో వచ్చే నెల మొత్తం ప్రమోషన్స్ స్పీడ్ పెంచి హంగామా చేయబోతున్నట్టు టాక్.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో అటు డైరెక్టర్ ఇటు సాయి ధరమ్ తేజ్ ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని ధీమాగా ఉన్నారు.

ఇందులో రమ్య కృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించే నున్నారు.జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు