అధికార కార్యక్రమాలలో భాగంగా తులా భారంలో పాల్గొన్న రోజా?

సినీ నటి, రాజకీయ నాయకురాలు ఆర్ కే రోజా గురించి అందరికీ సుపరిచితమే.

హీరోయిన్ గా అందరిని మెప్పించిన రోజా అనంతరం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే తొమ్మిది సంవత్సరాలపాటు ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన రోజాకు మంత్రి పదవి రావడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకొని పూర్తిగా ప్రజాసేవకే అంకితమయ్యారు.ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్న తర్వాత రోజా తన నియోజకవర్గంలో గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు.

ఇలా రోజా ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే అధికార కార్యక్రమాలలో భాగంగా రోజా తులాభారంలో పాల్గొన్నారు.

ఈ తులాభారంలో భాగంగా ఈమె బరువుకు సమానంగా బియ్యం, కందిపప్పు , బెల్లం వంటి నిత్యావసర వస్తువులను తులాభారం చేశారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ వస్తువులను పేదలకు అందించారు.ఇలా అధికార కార్యక్రమాలలో భాగంగా రోజా తులాభారంలో పాల్గొని పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.ఇకపోతే గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రోజా తన నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీయడమే కాకుండా ప్రజల సమస్యలను కూడా పరిష్కరిస్తూ బిజీగా ఉన్నారు.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు