ఆ డైరెక్టర్ పవన్ పై సెటైర్లు వేసాడు..అందుకే మహేష్ సినిమా వదిలేసా అంటూ రేణు దేశాయ్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

అందుకే రాజకీయాల ప్రభావం ఆయన సినిమాల మీద పడుతూ ఉంటుంది.

ఆయన గత మూడు చిత్రాలపై ప్రభుత్వం ఏ రేంజ్ లో కుట్రలు చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ ( Bheemla Naik )సినిమాలపై టికెట్ రేట్స్ ప్రభావం చాలా బలంగా పడింది.

ఈ రెండు సినిమాలు వంద కోట్ల రూపాయిల షేర్ కి దగ్గరగా వచ్చి ఆగిపోవడానికి కారణం టికెట్ రేట్స్.అయితే దీనిపై సినిమా ఇండస్ట్రీ నుండి ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందించలేదు.

పైగా కొంతమంది డైరెక్టర్స్ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైర్స్ వేస్తూ సన్నివేశాలను రాస్తున్నారు.అలాంటి డైరెక్టర్స్ జాబితా లో పరశురామ్ పెట్ల కూడా ఉన్నాడు.

Advertisement

ఈయన గురించి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ నాకు మహేష్ బాబు గారి సర్కారు వారి పాట ( Sarkaru vari pata )సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ గా నటించే ఛాన్స్ దక్కింది.చాలా మంచి పాత్ర, ఆ క్యారక్టర్ ని తర్వాత నదియా గారు చేసారు.నేను నటించడానికి సిద్దమే కానీ, నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ మీద కొన్ని పరోక్షమైన డైలాగ్స్ పెట్టించారు.

అది నాతోనే చెప్పించాలని చూసారు, అందుకే నేను ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదు అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.పరశురామ్ పెట్ల వైసీపీ పార్టీ కి మద్దతుదారుడు.

ఆయన అన్నయ్య గణేష్ పెట్ల కూడా వైసీపీ పార్టీ( YCP ) లో పని చేస్తున్నాడు.అందుకే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా సినిమాలో ఎదో ఒక డైలాగ్ కానీ, సన్నివేశం కానీ పెట్టాలని చూసాడు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఈ సినిమాలోని ఒక సన్నివేశం లో తనికెళ్ళ భరణి( Tanikela Bharani ) ఇంటికి లోన్ రికవరీ ఏజెంట్స్ గా ప్రభాస్ శ్రీను మరియు ఆయన గ్యాంగ్ వస్తారు.దౌర్జన్యం చెయ్యడానికి చూస్తే మహేష్ బాబు వాళ్ళతో ఫైట్ చేసి చివర్లో గాజు గ్లాస్ తీసి ప్రభాస్ నోట్లో పెట్టి లోపలకు పంపుతాడు.ఇక్కడ గాజు గ్లాస్ సన్నివేశాన్ని అవసరం లేకపోయినా కావాలని పెట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా విమర్శించడానికే అని అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

రేణు దేశాయ్ కామెంట్స్ చేసిన తర్వాత అభిమానులు సోషల్ మీడియా లో పరశురామ్ పెట్ల ని ట్యాగ్ చేసి బండ బూతులు తిడుతున్నారు.

తాజా వార్తలు