తలనొప్పిగా మారిన రవితేజ..ఎందుకో తెలుసా?

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ క్రాక్‌ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.

ఇటీవల డిస్కో రాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో డిజాస్టర్‌ను మూటగట్టుకోవడంతో ప్రస్తుతం క్రాక్ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ సినిమాలను లైన్‌లో పెట్టాలని చూస్తు్న్నాడు ఈ హీరో.అయితే రవితేజ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

దీనికి కారణంగా రవితేజ చేస్తున్న సినిమాలు వరుసగా ఫెయిల్యూర్‌లుగా మిగులుతున్నాయి.అయినా ఆయన భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తున్నా ఇంత భారీ మొత్తం డిమాండ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.ఒక్క సినిమాకు రవితేజ ఏకంగా రూ.12 కోట్ల మేరకు డిమాండ్ చేస్తుండటంతో నిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు.అయితే తన మార్కెట్‌ తనకు తెలుసని భావిస్తున్న రవితేజ, రెమ్యునరేషన్‌ విషయంలో ఎలాంటి మార్పు చేసేందుకు ఇష్టపడటం లేదట.

Advertisement

మరి రవితేజ రెమ్యునరేషన్ విషయంపై నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు