పుష్కరకాలం తరువాత ఆమెతో రొమాన్స్‌కు రవితేజ రెడీ

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ‘డిస్కోరాజా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది.

దీంతో తన నెక్ట్స్ మూవీ క్రాక్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు రవితేజ.గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా తరువాత కూడా రవితేజ వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.ఇప్పటికే రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో.

కాగా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి అప్పుడే నెలకొంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

Advertisement

గతంలో వివి వినాయక్ డైరెక్షన్‌లో తెరకెక్కిన కృష్ణ సినిమాలో రవితేజ సరసన అందాల భామ త్రిష నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వారిద్దరి కాంబినేషన్‌కు మంచి పేరు వచ్చింది.

ఇప్పుడు మళ్లీ దాదాపు 12 ఏళ్ల తరువాత ఈ జంట మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు.త్రిషకు ఈ సినిమా కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాతో రవితేజ మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకుంటాడని ఆశిద్దాం.

ఆ విషయంలో పవన్ కళ్యాణ్, కూతురు ఆద్య సేమ్ టు సేమ్.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు