ఎప్పుడు ఇదే ప్రశ్నేనా... చెప్పే వరకు ఆగండి రూమర్స్ పై స్పందించిన రష్మిక!

ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మిక మందన్నకు అనంతరం నటుడు విజయ్ దేవరకొండతో కలిసి గీతాగోవిందం సినిమాలో కలిసి నటించే అవకాశం వచ్చింది.

ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా కావడమే కాకుండా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు క్రియేట్ చేశారు.

ఇలా తరచూ రష్మిక విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ప్రశ్న గురించి పలుసార్లు ఈ సెలబ్రిటీలను ప్రశ్నించగా వారి మధ్య అలాంటి రిలేషన్ ఏదీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ టాక్ షోలో భాగంగా రష్మిక డార్లింగ్ అంటూ బహిరంగంగా చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.అయితే ఈ విషయంపై రష్మిక స్పందన కోసం అందరూ ఎదురు చూశారు.

అయితే తాజాగా ఒక బాలీవుడ్ మీడియా సమావేశంలో భాగంగా రష్మికకు ఈ విషయంపై మరోసారి ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు రష్మిక కాస్త భిన్నంగా స్పందించారు.

Advertisement

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పుడూ అదే ప్రశ్నేనా.నేను ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నాను కాస్త ఆ సినిమాల గురించి ప్రశ్నించండి.ఇలా సినిమాల గురించి కాకుండా ఎవరితోనో ఎఫైర్ ఉందని ఎవరితోనో రిలేషన్ ఉందని ప్రశ్నలు అడగడం వింటుంటే నాకు చిరాకు వేస్తుందని ఈమె సమాధానం చెప్పారు.

సెలబ్రిటీలన్న తర్వాత ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం.కానీ నేను నా సినీ కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి ఇదే ప్రశ్న ఎదురవడం చాలా చిరాకు పుట్టిస్తుంది.స్వయంగా నాకు నేను సమాధానం చెప్పే వరకు ఎవ్వరు కూడా నా వ్యక్తిగత జీవితంలో ఒక నిర్ణయానికి రావద్దు అంటూ ఈమె ఘాటుగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు