ఏడాది పూర్తి చేసుకున్న సైరా.. చరణ్ థ్యాంక్స్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ పీరియాడికల్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ ఎలాంటి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధను ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భావించాడు.

దీంతో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు.ఇక గతేడాది అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా వంటి భారీ క్యాస్టింగ్ ఉన్నారు.దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్ల పరంగా కూడా అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించి ఒక ట్వీట్ చేశాడు.

Advertisement

ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీని నిర్మించే అవకాశం తనకు లభించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సైరా సినిమా తనకు చాలా స్పెషల్ అని చెప్పిన చరణ్, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ వీడియోను పోస్ట్ చేశాడు.కాగా రామ్ చరణ్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో చరణ్ నటిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

వైట్ హౌస్ గేట్‌ను ఢీకొట్టిన వ్యక్తి.. కట్ చేస్తే మృతి..?
Advertisement

తాజా వార్తలు