‘మగధీర’ కాంబినేషన్‌

మెగా స్టార్‌ వారసుడు రామ్‌చరణ్‌ను మెగాపవర్‌స్టార్‌గా మార్చిన చిత్రం ‘మగధీర’.ఈ సినిమాతో టాలీవుడ్‌ రికార్డులను బద్దలు కొట్టాడు చరణ్‌.

ఒక కొత్త హీరో అంత పెద్ద సంచలన విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు.‘మగధీర’ రికార్డులు ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ సినిమాను అల్లు అరవింద్‌ గీతాఆర్ట్స్‌లో నిర్మించాడు.పెట్టిన పెట్టుబడికి డబుల్‌ వసూళ్లు చేసింది ఆ సినిమా.

‘మగధీర’ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాలేదు.‘మగధీర’ కాంబినేషన్‌లో సినిమాకు త్వరలో రంగం సిద్దం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

గీతా ఆర్ట్స్‌లో చరణ్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.కోనవెంకట్‌, గోపీ మోహన్‌లు కలిసి తయారు చేసిన ఒక కమర్షియల్‌ స్క్రిప్ట్‌కు రామ్‌చరణ్‌ ఓకే చెప్పాడు.

ఆ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని అంటున్నారు.ఆ సినిమాను అల్లు అరవింద్‌ భారీ బడ్జెట్‌తో గీతా ఆర్ట్స్‌లో నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు.

అల్లు అర్జున్‌, సురేందర్‌ రెడ్డిల కాంబినేషన్‌లో వచ్చిన ‘రేసుగుర్రం’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వడంతో ఈ దర్శకుడి క్రేజ్‌ మరింతగా పెరిగింది.ప్రస్తుతం ‘కిక్‌`2’ చేస్తోన్న సురేందర్‌ రెడ్డి ఆ తర్వాత గీతా ఆర్ట్స్‌లో చరణ్‌తో సినిమా చేయబోతున్నాడు.

మరి ‘మగధీర’ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

వయస్సు 93 , 107 మంది భార్యలు... 185 మంది సంతానం... ఆయన అంతమందిని పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలుసా
Advertisement

తాజా వార్తలు