ఒకే ఫ్రేమ్ లో చిరు, పవన్, చరణ్.. ఇంక మెగా అభిమానులకు పండగే!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్ళీ చేస్తున్న సినిమా వకీల్ సాబ్.

ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చాలా రోజుల తర్వాత పవన్ బిగ్ స్క్రీన్ పై కనబడబోతున్నాడు.

ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ చేసిన పింక్ సినిమాకు రీమేక్ గా వస్తుంది.

అయితే ఈ సినిమా ఏప్రిల్ 9 న విడుదల అవుతున్న సందర్భంగా ప్రొమోషన్స్ పెంచారు.ఇక చాలా రోజుల తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ లోకి రాబోతున్నారు.

Advertisement

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తున్నట్టు సమాచారం.ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లో చేయనున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ ఈవెంట్ ముఖ్య అతిధులుగా చిరంజీవి, రామ్ చరణ్ రాబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం.ఈ ఈవెంట్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించి మెగా అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు.దీంతో ఈ సినిమాకు భారీ ప్రమోషన్ యాడ్ అయినట్టే.

ఇప్పటికే ఈ సినిమా, సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో పవన్ కు జంటగా శృతి హాసన్ నటిస్తుంది.

అంతేకాదు అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఈ సినిమా తో పాటు పవన్ మరొక మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు.ఇది ఇలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు.

Advertisement

రామ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు