సీక్వెల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేస్తోన్న దర్శకుడు

హిట్‌ చిత్రాలకు సీక్వెల్‌లు రావడం ఇటీవల సర్వ సాధారణం అయ్యింది.ఈ పద్దతి హాలీవుడ్‌లో ఎక్కువగా ఉండేది.

ఆ తర్వాత బాలీవుడ్‌కు ఆ సంస్కృతి పాకింది.తాజాగా టాలీవుడ్‌లో కూడా సీక్వెల్స్‌ సందడి కనిపిస్తోంది.

ఇప్పటికే పలు సీక్వెల్స్‌ వచ్చాయి.త్వరలో వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.

అదే క్రమంలో తాజాగా విడుదలైన ‘రాజుగారి గది’ చిత్రంకు కూడా సీక్వెల్‌ రాబోతుంది.చిన్న చిత్రంగా తెరకెక్కి పెద్ద విజయాన్ని దక్కించుకున్న ‘రాజుగారి గది’ చిత్రం సక్సెస్‌ను వాడుకుని సీక్వెల్‌తో మళ్లీ బాగా సంపాదించాలనే ఆలోచనతో దర్శక నిర్మాత ఓంకార్‌ సీక్వెల్‌కు ప్లాన్‌ చేస్తున్నాడు.

Advertisement

‘రాజుగారి గది’ చిత్రం తర్వాత ఒక ఫ్యామిలీ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించాలని ఓంకార్‌ భావించాడు.అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో సిక్వెల్‌ చేయడం మంచిదని ఆయన సన్నిహితులు చెప్పడంతో పాటు, ఆయన కూడా అదే ఆలోచన చేయడంతో సీక్వెల్‌కు సన్నాహాల్లో ఉన్నాడు.

ఇప్పటికే సీక్వెల్‌ కోసం స్టోరీ లైన్‌ను అనుకున్నాడట.త్వరలోనే స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు పెట్టబోతున్నాడు.

వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే ‘రాజుగారి గది’ సీక్వెల్‌ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.మొదటి పార్ట్‌లో ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ హీరోగా నటించగా, రెండవ పార్ట్‌లో ఎవరు హీరోగా నటిస్తారో అనే విషయం తేలాల్సి ఉంది.

యువ స్టార్‌ హీరోలు ఓంకార్‌ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.దాంతో వారిలోంచి తీసుకుంటాడా లేక తమ్ముడు అశ్విన్‌ను మళ్లీ హీరోగా కొనసాగిస్తాడా అనేది చూడాలి.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు