క్లిక్ అయిన సూపర్ స్టార్ ఇంక ఆ హీరోలకు చుక్కలే...

ప్రస్తుతం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన టువంటి చిత్రం దర్బార్.ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన కోలీవుడ్ క్వీన్ నయనతార నటించగా సునీల్ శెట్టి, నివేద థామస్, ప్రతీక్ బబ్బర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రం  ఈరోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా రెండు షోలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.మామూలుగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే అభిమానులు తమ పనులన్నీ మానుకుని సినిమాకి వెళుతుంటారు.

అయితే ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని చూసినటువంటి రజినీకాంత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాక ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ ఈ చిత్రం తెచ్చుకుంది.

Advertisement

దీంతో టాలీవుడ్ లో మరో సారి తన సత్తా ఏంటో సూపర్ స్టార్ రజినీకాంత్ నిరూపించుకున్నాడు. అంతేగాక సంక్రాంతి బరిలో తెలుగు హీరోలకి తానేమి తీసిపొనంటూ దర్బార్ చిత్రం ద్వారా సవాల్ విసురుతున్నాడు రజనీకాంత్.

అయితే ఇది ఇలా ఉండగా టాలీవుడ్ ప్రిన్స్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రం, అలాగే స్టైలిష్ స్టార్ బన్నీ నటించినటువంటి అల వైకుంఠపురంలో చిత్రాలు కూడా సంక్రాంతి బరి లోకి దిగుతున్నాయి.ముందుగా సంక్రాంతి బరిలో దిగినటువంటి రజనీకాంత్ తన సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు.ఇక మిగిలింది మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ ల వంతు.

దీంతో అభిమానులు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సంక్రాంతి బరిలో ఎవరు గెలిచారనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు