'బ్రహ్మాస్త్ర'కు తన ఆయుధాన్ని వాడబోతున్న జక్కన్న.. ఇక సూపర్ హిట్టేనా?

బాలీవుడ్ లో మరొక పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది.బ్రహ్మాస్త్ర సినిమాతో టీమ్ అంతా బాలీవుడ్ మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.

ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ప్రెజెంట్ టీమ్ అంతా ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు.ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారి తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటిస్తుంది.

Advertisement

ఈ సినిమాలో నాగ్ కూడా కీలక పాత్రలో నటించాడు.అలాగే బాలీవుడ్ అగ్ర డైరెక్టర్ రాజమౌళి సైతం ఈ సినిమాలో భాగం అయ్యారు.

సౌత్ లోని నాలుగు భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఈయన కూడా భాగం కానున్నాడు.ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కుతుండగా.

మొదటి భాగం ఇప్పుడు రిలీజ్ కాబోతుంది.

అయితే ఈ సినిమాపై కూడా బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంది.దీంతో చాలా మంది రాజమౌళి గారిని మీరంటే మాకు గౌరవం ఉంది.ఈ సినిమాలో మీరు భాగం అవ్వకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయితే రాజమౌళి మాత్రం వీరెవ్వరిని పట్టించు కోకుండా తన మార్క్ వేలో ప్రొమోషన్స్ కోసం సిద్ధం అవుతున్నారు.రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ ను తీసుకుని ఆమెపై ఉన్న నెగిటివిటీ సినిమాపై పడకుండా ఎలా జాగ్రత్తగా కాపాడారో.

Advertisement

ఇప్పుడు కూడా ఈ సినిమా కోసం అదే విధంగా ప్రొమోషన్స్ చేయనున్నాడు.ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయగా అందుకు ఎన్టీఆర్ ను గెస్ట్ గా పిలిచి తెలుగు వాళ్ళ దృష్టిని ఈ సినిమాపై పడేలా చేసాడు.

ఇలా ఇప్పుడు తన స్ట్రాటజీని మొదలు పెట్టిన జక్కన్న ముందు ముందు జనాలలోకి ఎలా తీసుకు వేళ్తాడో చూడాలి.

తాజా వార్తలు