రాజ్ కుంద్రా కేసులో హీరోయిన్ షెర్లీన్ చోప్రాకు సమన్లు..!

పోర్న్ సినిమాల వ్యవహారంలో హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాజ్ కుంద్రా కేసులో సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

లేటెస్ట్ గా ఈ కేసుకు సంబందించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షెర్లీన్ చోప్రాకు పోలీసులు సమన్లు జారీ చేశారు.మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశించారు.

షెర్లీన్ చోప్రా ఇచ్చే ఇన్ఫర్మేషన్ ను బట్టి రాజ్ కుంద్రా కేసు మరింత బలంగా మారుతుందని తెలుస్తుంది.షెర్లీన్ చోప్రాని విచారించిన అనంతరం మరికొంతమందిని కూడా విచారణ చేయలని పోలీసులు అనుకుంటున్నారు.

రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పటి నుండి ఈ వ్యవహారంలో షెర్లీన్ చోప్రా పేరు కూడా వార్తల్లో నిలుస్తుంది.అంతేకాదు రాజ్ కుంద్రా కంపెనీ వియాన్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ను విచారించి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది.

Advertisement

ఈ కేసులో వియాన్ ఇండస్ట్రీకు సంబందించిన నలుగురు ఎంప్లాయీస్ సాక్షులుగా ఉన్నారని తెలుస్తుంది.ఈ కేసు నుండి రాజ్ కుంద్రా ఎలాగైనా బయట పడాలని ప్రయత్నిస్తున్నారు.

రాజ్ కుంద్రా కేసు రోజు రోజుకి ఉచ్చు బిగిస్తుంది.లాక్ డౌన్ టైం లో 100 సినిమాలు దాకా తీశాడన్న ఆరోపణలు ఉన్నాయి.

అయితే పోలీసులు వీటిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నాయి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు