క్లోనింగ్ విధానంతోనే ఆరోగ్యకరమైన పండ్ల మొక్కల ఉత్పత్తి సాధ్యం..!

వ్యవసాయ రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో ఎన్నో కొత్త మార్పులు వస్తున్నాయి.

ప్రస్తుతం ఉద్యానవన తోటలు సాగు చేసే రైతులంతా ఇప్పుడు నర్సరీల పైనే ఆధారపడుతున్నారు.

ఎందుకంటే నర్సరీ నిర్వాహకులు( Nursery Managers ) ఎప్పుడు కూడా నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధి పరుస్తున్నారు.నర్సరీలో పెరిగిన మొక్కలే ఆరోగ్యకరంగా ఉంటూ ఉండడంతో రైతులు ఈ మొక్కలనే సాగు చేసేందుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

ఎలాంటి తోటలను పండించిన ఆరోగ్యమైన, మంచి జాతి మొక్కలు అందుబాటులో ఉంటేనే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.పంట సాగు చేపట్టిన తొలి సంవత్సరంలో ఏదైనా తప్పు జరిగితే, తరువాతి కాలంలో ఆ తప్పును సరిదిద్దుకోవడం కుదరదు.

ఆ తప్పు వల్ల జరిగే నష్టాన్ని కచ్చితంగా ఎదుర్కోవలసిందే.

Advertisement

పండ్ల తోటలలో( orchards ) తీవ్ర నష్టానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.శ్రేష్టమైన విత్తనాలు లభించకపోవడం, ఉత్తమమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం.ఈ విషయాలను పెట్టుకున్నా నర్సరీ నిర్వాహకులు రైతులకు కావలసిన రకాలను అభివృద్ధి చేసి అందిస్తున్నారు.

క్లోనింగ్ విధానం( Cloning procedure ) అంటే.కొమ్మల కత్తిరింపులు.

తల్లి మొక్కల నుండి లేత కొమ్మలు కత్తిరించి వాటిని కోకోపీట్ ( Cocopeat )నింపిన ట్రేలలో నింపుతారు.ఆ తరువాత వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం కోసం హీట్ చాంబర్ లలో ఓ నలభై రోజులపాటు ఉంచి తర్వాత అక్కడ నుండి పది రోజులపాటు షెడ్ నెట్లలో ఉంచుతారు.

తర్వాత రెండు నెలల పాటు ఆరుబయట ఈ మొక్కల పెంపకం చేపడతారు.ఇప్పుడు ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఆరోగ్యకరమైన మొక్కలు తయారు అయినట్టే.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
బేబమ్మ చీరలో కేక పెట్టిస్తోన్న అందాలు.. కృతి శెట్టి గ్లామర్ షో

మామిడి, కొబ్బరి, జామ, పామాయిల్ లాంటి మొక్కలను క్లోనింగ్ విధానాల ద్వారా, అంటూ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేస్తారు.

Advertisement

తాజా వార్తలు