పంజాబ్ ప్లేయర్స్ కోసం ప్రీతీ జింటా 200 పరోటాలు చేసిందా ?

హీరోయిన్స్ అంటే చాల సుకుమారంగా ఉంటారు.

అందంగా ఉంటారు కానీ ఎలాంటి కష్టం చేయలేరు అని అనుకుంటమా కానీ అదంతా వట్టి మాటే అని నిరూపించింది బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా( Preity Zinta ).

ఆమె తన స్వహస్తాలతో ఏకంగా 200 ల ఆలు పరాటా చేసిందట.మరి అన్నేసి పరోటాలు ఎందుకు చేయాల్సి వచ్చింది , ఎవరి కోసం చేయాల్సి వచ్చింది, అందుకు గల కారణాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.

ప్రీతీ జింటా కేవలం బాలీవుడ్( Bollywood ) హీరోయిన్ గా మాత్రమే కాకుండా పంజాబ్ జట్టుకు కో ఓనర్ అనే విషయం మన అందరికి తెలిసిందే.

ఆమె తన జట్టు ఆటగాళ్లకు తన చేత్తో 200 ల ఆలు పరోటాలు చేసి పెట్టినట్టు గా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే హీరోయిన్స్ కి ఇంత శ్రమ ఎందుకు కో అంటే కోటి మంది వస్తారు కదా పని వాళ్ళు అనే కదా మీ అనుమానం.నిజానికి సౌత్ ఆఫ్రికా( South Africa ) లో జరిగిన ఐపీల్ టూర్ కి వెళ్తున్న పంజాబ్ జట్టు ప్లేయర్స్ ని మోటివేట్ చేయడానికి ఆలు పరోటా చేసి పెడతానని, ఆలా చేయాలంటే ఆ రోజు జరిగే మ్యాచ్ గెలవాలనే కండిషన్ పెట్టింది అంట.దాంతో పంజాబ్ టీమ్ చక్కగా ఆది మ్యాచ్ గెలిచారట.ఇచ్చిన మాట ప్రకారం ప్రీతి తన చేతులతో టీమ్ మొత్తానికి 200 లకు పైగా పరోటాలు చేసి పెట్టి వారికి సౌత్ ఆఫ్రికా టూర్ లో ఇండియన్ వంట రుచి చూపించింది.

Advertisement

అయితే ఆ తర్వాత నుంచి నేటి వరకు మళ్లి ప్రీతీ జింటా ఒక్క సారి కూడా పరోటా జోలికి వెళ్లలేదట.ఇక ప్రీతీ జింటా ప్రస్తుతం కూడా పంజాబ్ జట్టుకు కో ఓనర్ గా ఉన్నారు.ఆమె అమెరికన్ బిజినెస్ మ్యాన్ ఆయిన్ జీన్ గూడెనౌగ్( Jean Goodenough ) అనే వ్యక్త్తిని 2016 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఈ జంట కు లాక్ డౌన్ లో కవల పిల్లలు పుట్టారు.అప్పుడప్పుడు ఇండియా కు వచ్చి వెళ్తున్న ప్రీతీ బాలీవుడ్ సినిమాలకు మాత్రం పూర్తి స్థాయిలో గుడ్ బాయ్ చెప్పింది.

ఆమె తెలుగు వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబు సరసన రాజకుమారుడు సినిమాల్లో నటించింది.ఈ ఏడాది ద నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ ని కూడా ప్రొడ్యూస్ చేసింది.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?
Advertisement

తాజా వార్తలు