ప్రభాస్ సలార్ కోసం ఆ బాలీవుడ్ స్టార్ ని సంప్రదిస్తున్నారంట

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో సలార్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ సిరీస్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో రాబోతున్న రెండో సినిమా ఇది కావడం విశేషం.

పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమా కంటే ముందుగానే ప్రభాస్ మరో పెద్ద ప్రాజెక్ట్స్ రెండింటిని లైన్ లో పెట్టాడు.

వాటిలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ ఒకటి కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఏకంగా 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ ఒకటి.ఈ రెండు పూర్తి చేసిన తర్వాత సలార్ సినిమా షూటింగ్ ని ప్రభాస్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు.

అయితే ఇకపై ఒక్కో సినిమా మీద ఏడాది మొత్తం స్పెండ్ చేయకుండా కాల్ షీట్స్ ప్రకారం వెళ్ళడానికి రెడీ అయ్యారు.

Advertisement

ఈ నేపధ్యంలో ఆది పురుష్ కోసం 90 రోజులు కాల్షీట్స్ ని ప్రభాస్ కేటాయించాడు.ఫిబ్రవరి నుంచి ఆ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడు.అది పూర్తయిన వెంటనే నాగ్ అశ్విన్ సినిమా కోసం మరో మూడు నుంచి నాలుగు నెలలు స్పెండ్ చేయబోతున్నాడు.

అది పూర్తి చేసిన వెంటనే సలార్ స్టార్ట్ చేస్తాడు.ఈ లెక్కన సలార్ మూవీ కూడా ఈ ఏడాది ఆఖరున ప్రారంభం అవుతుంది.ఈ నేపధ్యంలో ప్రశాంత్ నీల్ ఆ సినిమా మెయిన్ క్యాస్టింగ్ మీద ఫోకస్ పెట్టాడు.

హీరోయిన్, మెయిన్ విలన్ పాత్రల కోసం బాలీవుడ్ నటులని తీసుకోవాలని అనుకుంటున్నారు.ప్రభాస్ కి బాస్ పాత్రలో మోహన్ లాల్ నటించబోతున్నట్లు టాక్ ఉంది.

ఇప్పుడు ప్రభాస్ కి పోటీ ఇచ్చే పవర్ ఫుల్ ప్రొటొగోనిస్ట్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం జాన్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్
చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?

మరి వీటి మధ్యలో ప్రభాస్ కోసం విలన్ గా నటించడానికి ముందుకొస్తాడా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు