ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంలో విచారణ వాయిదా

ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

ఈ విషయంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్ లపై విచారణను ధర్మాసనం ఆగస్ట్ 28వ తేదీకి వాయిదా వేసింది.

కొన్ని అనివార్య కారణాలతో విచారణ వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు విన్నవిస్తూ లేఖ రాశారు.అయితే దీనిపై తమకు ముందస్తు సమాచారం ఏం అందలేదని, కేసు విచారణ వెంటనే చేపట్టాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు.

ఈ క్రమంలో కేసు తీవ్రత దృష్ట్యా విచారణ వాయిదా వేయొద్దన్న ప్రభుత్వ లాయర్ల వాదనలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా, ఎం త్రివేది ధర్మాసనం విముఖత చూపింది.అనంతరం ఆగస్ట్ 28న విచారణ జరుపుతామని మరోసారి వాయిదా కోరవద్దని రేవంత్ రెడ్డి న్యాయవాదులకు కోర్టు సూచించింది.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 
Advertisement

తాజా వార్తలు