వ్యభిచార గృహాలపై దాడి చేసిన పోలీసులు..!

మహిళల అవసరాలను కొంతమంది ఆసరాగా తీసుకుకొని వారితో వ్యభిచారాలను చేయిస్తున్నారు.మరికొంత మంది అమాయకపు ఆడపిల్లకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు.

వ్యభిచార ముఠాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దాడులు చేశారు.అయితే దాడుల్లో పట్టుబడిన పలువురు బాలికలకు వ్యభిచార కూపం నుండి విముక్తి కలిగించారు.

అయితే వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోని కౌన్సెలింగ్ ఇచ్చారు.అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే.

రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ మహిళ ఆరేళ్ల క్రితం వేరే ప్రాంతానికి చెందిన బాలికను చదువు పేరుతో ఇక్కడికి తీసుకొచ్చింది.అయితే ఆమెను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement

దీనిపై యువతి తన కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసింది.అయితే దీనిపై మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు.

ఆ ప్రాంతంలో నివసిస్తున్న వ్యభిచార మహిళలకు పలు హెచ్చరికారులు జారీ చేశారు.అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వారిని ఇప్పటికైనా తీరు మార్చుకుని గౌరవంగా బ్రతకాలని తెలియజేశారు.అంతేకాకుండా పోలీసుల వరుస దాడులపై సమాచారం అందుకున్న జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తంగళ్లపల్లిలోని వేశ్యావాటికలను సందర్శించి తనిఖీలు చేశారు.

రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?
Advertisement

తాజా వార్తలు