ఫోన్ ట్యాపింగ్ కేసు: విచారణకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ( SIB chief Prabhakar Rao )ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.

కేసు జరుగుతున్న సమయంలో అమెరికాకు వెళ్లిన ఆయన తిరిగి హైదరాబాద్ కు వస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతారని తెలుస్తోంది.

ఎస్ఐబీ చీఫ్( SIB Chief ) గా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని పలు ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు రాధాకిషన్ రావును( Radhakishan Rao ) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

Advertisement
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు

తాజా వార్తలు