ఈటెలకు ఝలక్ ఇస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు...

తెలంగాణలో మరో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనున్న విషయం తెలిసిందే.అదే హుజూరాబాద్ ఉప ఎన్నిక.

దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో, హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా ఇటు టీఆర్ఎస్ కు, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితి ఉంది.అయితే ఇంకా నోటిఫికేషన్ వెలువడక ముందే హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం మొదలైందని చెప్పవచ్చు.

అయితే మాజీ మంత్రి ఈటెల మరియు ఈటెల భార్య జమున ఇప్పటికే హుజూరాబాద్ లో ప్రచారాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

అయితే ఆత్మగౌరవం నినాదంతో టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన ఈటెల ఇదే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఈటెలకు, ఈటెల భార్య జమునకు ప్రజలు ఝలక్ ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించారని, మరల ఇప్పుడు ఓట్ల సమయం ఉంది కాబట్టి మరల మా వద్దకు వచ్చారని, అభివృద్ధి గురించి ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రజలు నిలదీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పరిస్థితి ఉంది.

Advertisement

అయితే ఈ వ్యతిరేకత పెద్ద ఎత్తున మొదలైతే బీజేపీ ఎన్నికలో కొంత శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది.మరి ఈటెల ఈ ఎన్నికలో సత్తా చాటుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు