సద్దికూడు తిన్నా పులివెందులలో పాదయాత్ర చేస్తా

జగన్ టార్గెట్ గా రాయలసీమలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మదనపల్లిలో అనంతపురం హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ ప్రస్తుత రాజకీయాల గురించి ఆవేశంగా ప్రసంగించారు.

అనంతపురం జిల్లా కార్యకర్తల ఆకాంక్ష మేరకు తాను ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటిస్తానని పవన్ అన్నారు.తాను తిరగలేక కాదని మూడున్నర లక్షల మందితో పోరాట యాత్ర చేసిన వాడిని అంటూ పవన్ ప్రసంగించారు.

ప్రతి నియోజకవర్గానికి తాను తిరుగుతానని, అవసరమైన చోట పాదయాత్ర చేస్తానని, అందర్ని కలుస్తా అని, మీరు కూడా మాటలు చెప్పడం కాదని, పాదయాత్రకు సంబంధించి తగిన ప్రణాళికలు రూపొందించండి అంటూ పవన్ సూచించారు.తాను రాయలసీమ మొత్తం పర్యటిస్తానని, పులివెందులలో కూడా పాదయాత్ర చేస్తానని పవన్ చెప్పారు.

టమాటా రైతులతో తాను నేల మీద కూర్చుని మాట్లాడానని, రాజధాని రైతులు పెట్టిన సద్ది కూడు తిన్నానని, నాకు దారి ఇవ్వండి పులివెందుల లో కూడా నడిచి చూపిస్తానంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించారు.

Advertisement
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

తాజా వార్తలు