సూపర్ స్టార్ మహేష్ బాబు నటంచిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.
సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయాల్సి ఉంది.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.
దీంతో తన నెక్ట్స్ మూవీని గీతా గోవిందం డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.పరశురాం చెప్పిన ఓ స్టోరీలైన్ మహేష్కు బాగా నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు మహేష్ ఓకే అన్నాడట.
అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా స్క్రిప్టును మహేష్కు పూర్తిగా వినిపించడం కుదరడం లేదట.దీంతో పరశురాం తాజాగా ఈ సినిమా స్క్రిప్టును మహేష్కు మెయిల్ చేశాడట.
ఈ స్క్రిప్టుకు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే మహేష్ చెప్పిన తరువాత స్క్రిప్టును ఫైనల్ చేయనున్నారు.మొత్తానికి లాక్డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ సినిమా పనులు మాత్రం ఆగడం లేదు.
మరి ఈ సినిమాను ఎప్పటికి సెట్స్పైకి తీసుకెళ్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy