పేపర్ లీక్ కేసు.. కస్టడీ పిటిషన్‎పై నాంపల్లి కోర్టులో విచారణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.

మొత్తం ఏడుగురు నిందితులను కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

కాగా ఈ కేసులో ఇప్పటికే నిందితులను ఆరో రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే.అయితే కస్టడీ ముగియడంతో మరోసారి నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ వేసింది.

ఈ నేపథ్యంలో నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, రాజేశ్వర్, శబిన్, డాక్యాతో పాటు రమేశ్, సురేశ్ లను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు