భయపడుతున్న డార్లింగ్ ఫ్యాన్స్.. మరి ఆ సెంటిమెంట్ ను నీల్ చెరిపేస్తాడా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఆడియెన్స్ లో ఎంత క్రేజ్ నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈయన కనిపిస్తే చాలు అభిమానులు సర్వం మర్చి పోతారు.

అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టలేక పోయాడు.సాహో, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అయితే ఆ రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.ప్రభాస్ ప్రెసెంట్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.

Advertisement

కెజిఎఫ్ భారీ విజయం సాధించడంతో సలార్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా గురించి ఇటీవలే ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

సినిమా క్లైమాక్స్ అంతా కూడా సముద్రం లోనే జరుగుతుందని టాక్.అంతేకాదు సముద్రం లోపల చేసే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ మరొక రేంజ్ లో ఉండబోతుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా కూడా క్లైమాక్స్ సముద్రంలోనే షూట్ చేసారు.మరి ఇప్పుడు సలార్ షూట్ కూడా అలానే ఉండబోతుంది అని వార్తలు వస్తున్నాయి.

దీంతో డార్లింగ్ అభిమానులు ఆ విషయంలో ఆందోళన చెందుతున్నారు.ఈ సినిమా కూడా అలానే అవుతుందేమో అని భయపడుతున్నారు.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

మరి ఈ సెంటిమెంట్ ను ప్రశాంత్ నీల్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.

Advertisement

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజా వార్తలు