టైటానిక్ సబ్‌లో ఎవరెవరున్నారు? ఇంతకీ ఈ షహజాదా దావూద్‌ ఎవరు?

గత రెండు మూడు రోజులనుండి అంతర్జాతీయంగా కుదిపేస్తున్న వార్త ఏదన్న వుంది అంటే అది టైటానిక్ షిప్( Titanic Ship ) వార్త.

అవును, టైటానిక్ శిథిలాలను చూపించేందుకు సముద్రంలోకి టూరిస్టులను తీసుకెళ్లిన సబ్ మేరీన్ ఆచూకీ లేకుండా పోయిన సంగతి అందరికీ తెలిసినదే.

టైటానిక్ సబ్‌లో 5 మంది వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది.దాంట్లో పాకిస్థానీ వ్యాపారవేత్త షహజాద్ దావూద్‌తో( Shahzada Dawood ) పాటు ఆయన కుమారుడు ఉండడం కొసమెరుపు.

అయితే ఆ సబ్‌లో కేవలం 4 రోజులకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.అయితే టైటానిక్ నౌక మునిగిన ప్రదేశంలో ఉన్న శిథిలాలను చూసేందుకు వెళ్లిన అయిదుగరు టూరిస్టులు మిస్సింగ్ అయ్యారు.

పాక్‌లో అత్యంత సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తి షహజాద్ దావూద్‌ ఎస్ఈటీఐ ఇన్స్‌టిట్యూట్‌లో ట్రస్టీగా ఉన్నారు.పాకిస్థానీలతో పాటు బ్రిటీష్ వ్యాపారవేత్త ఒకరు ఉన్నట్టు తెలుస్తోంది.58 ఏళ్ల హమీష్ హార్డింగ్ .( Hamish Harding ) యాక్షన్ ఏవియేషన్ సంస్థ చైర్మెన్‌.ఓషియన్‌గేట్ సీఈవో స్టాక్‌టన్ రష్ కూడా ఈ లిస్టులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

ఓషియన్‌గేట్ కంపెనీయే ఈ మిషన్‌ను ఆర్గనైజ్ చేసినట్టు తెలుస్తోంది.అంతేకాకుండా ఫ్రాన్స్‌కు చెందిన 73 ఏళ్ల అన్వేషకుడు పౌల్ హెన్రీ నర్జియోలెట్ కూడా వారితో పాటు ఉన్నారు.

ఇక మిస్సైన పాకిస్థానీలు బ్రిటీష్ పౌరులు అని కూడా తెలుస్తోంది.కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో టైటానిక్‌ శిథిలాల వద్ద ఈ ఘటన జరిగినట్టు సమాచారం.టూరిస్టు సబ్‌మెర్సిబుల్ డైవ్ చేసిన గంటా 45 నిమిషాల తర్వాత ఆ సబ్‌తో లింక్ కట్ అయ్యింది.

అయితే ఆ సబ్‌లో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ టైటాన్ సబ్‌మెర్సిబుల్ సుమారు 10,432 కిలోల బరువు ఉంటుంది.6.7 మీటర్ల పొడుగు ఉంటుంది.ఇక 96 గంటల పాటు దాంట్లో అయిదుగురు ప్రయాణించవచ్చు.

కాగా ఈ సబ్‌లో 8 రోజుల పర్యటనకు గాను రెండున్నర లక్షల డాలర్లు వసూల్ చేస్తున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు