టైటానిక్ సబ్లో ఎవరెవరున్నారు? ఇంతకీ ఈ షహజాదా దావూద్ ఎవరు?
TeluguStop.com
గత రెండు మూడు రోజులనుండి అంతర్జాతీయంగా కుదిపేస్తున్న వార్త ఏదన్న వుంది అంటే అది టైటానిక్ షిప్( Titanic Ship ) వార్త.
అవును, టైటానిక్ శిథిలాలను చూపించేందుకు సముద్రంలోకి టూరిస్టులను తీసుకెళ్లిన సబ్ మేరీన్ ఆచూకీ లేకుండా పోయిన సంగతి అందరికీ తెలిసినదే.
ఆ టైటానిక్ సబ్లో 5 మంది వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది.దాంట్లో పాకిస్థానీ వ్యాపారవేత్త షహజాద్ దావూద్తో( Shahzada Dawood ) పాటు ఆయన కుమారుడు ఉండడం కొసమెరుపు.
అయితే ఆ సబ్లో కేవలం 4 రోజులకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే టైటానిక్ నౌక మునిగిన ప్రదేశంలో ఉన్న శిథిలాలను చూసేందుకు వెళ్లిన అయిదుగరు టూరిస్టులు మిస్సింగ్ అయ్యారు.
"""/" /
పాక్లో అత్యంత సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తి షహజాద్ దావూద్ ఎస్ఈటీఐ ఇన్స్టిట్యూట్లో ట్రస్టీగా ఉన్నారు.
పాకిస్థానీలతో పాటు బ్రిటీష్ వ్యాపారవేత్త ఒకరు ఉన్నట్టు తెలుస్తోంది.58 ఏళ్ల హమీష్ హార్డింగ్ .
( Hamish Harding ) యాక్షన్ ఏవియేషన్ సంస్థ చైర్మెన్.ఓషియన్గేట్ సీఈవో స్టాక్టన్ రష్ కూడా ఈ లిస్టులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఓషియన్గేట్ కంపెనీయే ఈ మిషన్ను ఆర్గనైజ్ చేసినట్టు తెలుస్తోంది.అంతేకాకుండా ఫ్రాన్స్కు చెందిన 73 ఏళ్ల అన్వేషకుడు పౌల్ హెన్రీ నర్జియోలెట్ కూడా వారితో పాటు ఉన్నారు.
"""/" /
ఇక మిస్సైన పాకిస్థానీలు బ్రిటీష్ పౌరులు అని కూడా తెలుస్తోంది.
కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో టైటానిక్ శిథిలాల వద్ద ఈ ఘటన జరిగినట్టు సమాచారం.
టూరిస్టు సబ్మెర్సిబుల్ డైవ్ చేసిన గంటా 45 నిమిషాల తర్వాత ఆ సబ్తో లింక్ కట్ అయ్యింది.
అయితే ఆ సబ్లో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ టైటాన్ సబ్మెర్సిబుల్ సుమారు 10,432 కిలోల బరువు ఉంటుంది.
6.7 మీటర్ల పొడుగు ఉంటుంది.
ఇక 96 గంటల పాటు దాంట్లో అయిదుగురు ప్రయాణించవచ్చు.కాగా ఈ సబ్లో 8 రోజుల పర్యటనకు గాను రెండున్నర లక్షల డాలర్లు వసూల్ చేస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు .. సోనియా గాంధీ చుట్టూ వివాదం