పద్మ అవార్డ్స్.. కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ ఆర్టిస్టులు?

భారత ప్రభుత్వం వివిధ రంగాలలో సేవలు చేసిన వారికి పద్మ అవార్డ్స్ తో సత్కరిస్తుంది.

ఈక్రమంలోనే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ అనే అవార్డులతో సత్కారాలు చేస్తుంటుంది.

ప్రతి ఏడాది ఇలా ఈ అవార్డులతో ఎంతోమందిని సత్కరించే ప్రభుత్వం ఈ ఏడాది కరోనా వల్ల ఈ అవార్డుల ప్రదానోత్సవం ఆలస్యం అయింది.ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఈ పద్మ అవార్డ్స్ వేడుకలో భాగంగా పలువురు బాలీవుడ్ తారలు ఈ అవార్డును అందుకున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీలు అయినటువంటి కరణ్ జోహార్, కంగనా రనౌత్, ఏక్తా కపూర్ వంటి వారికి ఈ అవార్డులు దక్కాయి.ఈ క్రమంలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదగా రాష్ట్రపతి భవన్ లో ఈ అవార్డులను అందుకున్నారు.

ఈ అవార్డును అందుకున్న తర్వాత కరణ్ జోహార్, కంగనా రనౌత్ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కరణ్ జోహార్ మాట్లాడుతూ.

Advertisement

ఇలాంటి పురస్కారం లభించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలియజేశారు.

అదేవిధంగా కంగనా మాట్లాడుతూఅవార్డు అందుకున్న తరువాత తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలను పడ్డానని ఈ క్రమంలోనే తనకు ఎంతో మంది శత్రువులు కూడ తయారయ్యారని ఈ సందర్భంగా నటి కంగనా రనౌత్ తెలిపారు.ఇక చివరిగా ఏక్తాకపూర్ మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమమైన నాల్గవ అవార్డును అందుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది అంటూ ఆమె ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు