బాలయ్యకు నిర్మాతలు లేరట.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ కాస్త గ్యాప్ తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం ఇటీవల షూటింగ్ మొదలుపెట్టింది.

ఈ సినిమా ఎప్పుడో లాంఛ్ అయినా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఇక షూటింగ్ మొదలు కావడంతో నందమూరి ఫ్యాన్స్‌లో సంతోషం నెలకొంది.గతంలో బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు బి.గోపాల్‌తో బాలయ్య తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.గతంలో బాలయ్యకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన బి.గోపాల్‌ మరోసారి బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడట.కథ విన్న బాలయ్య ఈ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

కానీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు నిర్మాతలెవ్వరూ ముందుకు రావడం లేదట.గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

దీంతో మరోసారి బాలయ్య-గోపాల్‌లతో కలిసి రిస్క్ తీసుకోవాలని ఎవరు ముందుకు రావడం లేదని చిత్ర వర్గా్ల్లో టాక్.మరి బాలయ్య చేయాలనుకుంటున్న ఈ సినిమాకు నిర్మాత దొరుకుతుతాడా లేడా అనేది చూడాలి.

Advertisement
శబరి మూవీ రివ్యూ: మదర్ సెంటిమెంట్ మాములుగా లేదుగా!

తాజా వార్తలు