వైయస్ రాజశేఖర్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన నిమ్మగడ్డ..!!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతం కడప జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు.ఈ సందర్భంగా ఒంటిమిట్ట రామాలయం సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాము ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసినట్లు స్పష్టం చేశారు.వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తాను ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా నిజాలు నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చేవారిని నిమ్మగడ్డ షాకింగ్ కామెంట్ చేశారు.ఇదే క్రమంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అంతేకాకుండా సాధారణ ఎన్నికల ప్రక్రియ సరికాదని, ఇటువంటి ప్రక్రియ పై షాడో బృందాలు దృష్టి పెడతానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.ఏలాంటి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదని సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించడమే తన బాధ్యత అని అన్నారు.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు