అప్పుడు వైసీపీ విషయంలో జరిగిన కుట్ర ఇప్పుడు పవన్ విషయంలో.. జాగ్రత్త పడాల్సిందే!

ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) ను ఓడించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.

పిఠాపురం బరిలో నవరంగ కాంగ్రెస్ నుంచి మరో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా అతని ఇంటి పేరు కూడా కే కావడం గమనార్హం.

నవరంగ్ కాంగ్రెస్ పార్టీ( Navarang Congress Party ) గుర్తు కూడా జనసేన పార్టీకి దగ్గరగా ఉండటంతో పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.పవన్ ను ఓడించడానికి కావాలనే ఇలా ప్లాన్ చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.2019 సంవత్సరంలో వైసీపీ నుంచి పోటీ చేసే నేతల పేర్లతో ఉండే నేతలు ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.అప్పుడు వైసీపీ విషయంలో జరిగిన కుట్ర ఇప్పుడు పవన్ విషయంలో జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇద్దరు నేతల పేర్లు, పార్టీ గుర్తులు ఒకే విధంగా ఉంటే ఓటు ఒక పార్టీకి బదులుగా మరో పార్టీకి పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ పిఠాపురం( Pithapuram )లో గెలవడం పక్కా అని పలు సర్వేలు చెబుతుండగా ఆయన మెజారిటీని తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఎన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జనసేన( Janasena ) తరపున కొంతమంది సినీ ప్రముఖులు స్టార్ క్యాంపెయినర్లుగా పని చేస్తున్నారు.

Advertisement

హైపర్ ఆది, గెటప్ శ్రీను, 30 ఇయర్స్ పృథ్వీ జనసేన తరపున స్టార్ క్యాంపెయినర్లుగా పని చేస్తున్నారు.జానీ మాస్టర్, అంబటి రాయుడు, మొగలిరేకులు ఫేమ్ సాగర్( Sagar ) కూడా జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా పని చేయనున్నారు.జనసేన పార్టీ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.

చిరంజీవి( Chiranjeevi ) పరోక్షంగా జనసేనకు మద్దతు ఇవ్వడం కూడా ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు