అందుకే మీడియాని దూరం పెట్టాను అంటున్న నయనతార

దక్షిణాదిలో నెంబర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ నయనతార.

కెరియర్ ఆరంభం నుంచి ఎక్కడా కూడా ఆగిపోకుండా అవిశ్రాంతంగా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా నయనతార ఉంది.

ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్ళకి సమీపిస్తున్న ఇంకా ఏ మాత్రం వన్నె తగ్గని అందంతో అదే వేగంతో సినిమాలు చేస్తుంది.సౌత్ లో ఈ అమ్మడు మాత్రమే రెండు సార్లు ప్రేమలో పడి మోసపోయింది.

ఆ కష్టాన్ని దాటుకొని హీరోయిన్ గా తన ప్రస్తానం కొనసాగిస్తుంది.ప్రస్తుతం తన మనసుకి నచ్చిన ప్రేమికుడు విగ్నేష్ శివన్ తో ప్రస్తుతం డేట్ లో ఈ భామ ఉంది.

ఇదిలా ఉంటే గత పదేళ్ల కాలంగా నయనతార సినిమా ప్రమోషన్స్ కి కానీ, మీడియా ఇంటర్వ్యూలకి గాని ఎటెండ్ కాలేదు.పూర్తిగా మీడియాకి దూరంగా ఉందని చెప్పాలి.

Advertisement

ఏదైనా చెప్పాల్సి వస్తే, సోషల్‌ మీడియా ద్వారా మాత్రమే చెబుతుంది.ఇలా మీడియాకి దూరంగా ఉండటానికి కారణం, ఆమె మనసుకు గతంలో తగిలిన ఓ గాయమని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది.

చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో ఎప్పుడూ మీడియాకు అందుబాటులోనే ఉండేదాన్ని.కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన వాటిని మీడియా వక్రీకరించింది.

అది నా మనసును చాలా బాధపెట్టింది.ఆ గాయం కారణంగానే వాళ్లకు దూరంగా ఉంటూ వస్తున్నాను.

ఈ పదేళ్లలో ఎవరికీ ఇంటర్వ్యూలు, వీడియో బైట్స్‌ ఇవ్వలేదు.నటిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కష్టపడుతుంటాను.ఇండస్ట్రీ అంటేనే మగవాళ్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కానీ, ఈ విషయంలో ఎప్పుడూ సర్దుకుపోలేదు.నా మనసుకు నచ్చిన కథలనే ఎంపిక చేసుకుంటుంటాను.

Advertisement

షూటింగ్స్, కాస్ట్యూమ్, మేకప్‌ ఇలా ప్రతి విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటా.పరిశ్రమలోని వ్యక్తులు నా గురించి ఏమనుకుంటారనే విషయం నేనెప్పుడూ పట్టించుకోలేదు అని నయనతార చెప్పుకొచ్చింది.

మొత్తానికి కెరియర్ ఆరంభంలో తగిలిన గాయానికి నయనతార మీడియాకి గట్టిగానే పనిష్మెంట్ ఇచ్చిందని చెప్పాలి.

తాజా వార్తలు