వైరల్‌ : చెత్త ఏరిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన మార్క్‌ను చూపించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు.ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో ఉన్నాడు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మహాబలిపురం పర్యటన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరుండి మరీ ఆయనకు స్థానిక చారిత్రాత్మక ప్రదేశాలను చూపిస్తున్నారు.నిన్న రాత్రి మహాబలిపురంలోనే బస చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఉదయం స్థానిక బీచ్‌లో వాకింగ్‌ చేశారు.

వాకింగ్‌ సందర్బంగా బీచ్‌లో చెత్త కనిపించడంతో ఆయన వెంటనే వాటిని శుభ్రం చేయాలనుకున్నాడు.కొన్ని సంచులను తీసుకున్న ప్రధాని బీచ్‌లో ఉన్న చెత్తను ఏరి అందులో వేశారు.

దాదాపు గంట పాటు స్థానికంగా బీచ్‌లో మోడీ చెత్త ఏరడం జరిగింది.ఆ సమయంలో వాకింగ్‌కు వచ్చిన పలువురు ఆయన చెత్త వేరడం చూసి ఆశ్చర్యపోయారు.

Advertisement

మోడీ చెత్త ఏరుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ప్రధాని బీచ్‌లో చెత్త ఏరడం చూసిన ప్రతి ఒక్కరు ఆయన సింప్లిసిటీకి హ్యాట్సాప్‌ చెబుతున్నారు.

కొందరు మాత్రం ఇది ఆయన పబ్లిసిటీ స్టంట్‌ అంటూ కొట్టి పారేస్తున్నారు.ఏది ఏమైనా కూడా మోడీ మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు