రాజమండ్రిలో ముఖ్యనేతలతో నారా లోకేశ్ కీలక భేటీ..!

రాజమండ్రిలో టీడీపీ నేత నారా లోకేశ్ కీలక భేటీ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.ఈ మేరకు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అవుతున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలుకు సమీపంలో ఉన్న స్థానిక మాజీ కార్పొరేటర్ నివాసంలో లోకేశ్ సమావేశం నిర్వహించారని సమాచారం.ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ తరువాత పరిణామాలపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మరికాసేపటిలో ఇంటి దగ్గర నుంచి లోకేశ్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ములాఖత్ కి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు.కాగా చంద్రబాబు జైలులో ఉన్నన్ని రోజులు లోకేశ్ రాజమండ్రిలోనే ఉండే అవకాశం ఉంది.

మరోవైపు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

Advertisement
మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 

తాజా వార్తలు