సమంతతో సినిమా చేయడంపై క్లారిటీ ఇచ్చిన నందిని రెడ్డి

టాలీవుడ్ లో మహిళా దర్శకురాలిగా విజయ నిర్మల, బి జయ తర్వాత ఆ స్థాయిలో నందిని రెడ్డి గుర్తింపు తెచ్చుకుంది.

చివరిగా సమంతతో ఆమె ఓ బేబీ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.

ఈ నేపధ్యంలో ఆమె నెక్స్ట్ సినిమా మళ్ళీ సమంతతోనే ఉంటుందని, అది కూడా ఒక కొరియన్ మూవీ రీమేక్ అంటూ టాక్ వినిపించింది.ఇందులో సమంతకి జోడీగా నాగ చైతన్య హీరోగా నటించబోతున్నాడు అని ప్రచారం జరిగింది.

ఈ ప్రచారంపై తాజాగా నందిని రెడ్డి క్లారిటీ ఇచ్చింది.నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పనుల్లోనే ప్రస్తుతం తాను ఉన్నానని చెప్పింది.

అయితే ఈ ప్రాజెక్టులో సమంత నటించడం లేదని, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదను అని తేల్చేసింది.ఒకవేళ సమంతతో చేసే అవకాశం వస్తే కచ్చితంగా నేనే నేనే చెబుతాను.

Advertisement

అలాగే తాను ప్రస్తుత్జం చేయబోయే సినిమా రీమేక్ కాదు.తాను రాసుకున్న స్ట్రైట్ కథ.ఈ సినిమాకి స్వప్న దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలను తెలియజేస్తాను అని స్పష్టం చేసింది.

అయితే నందిని చేయబోయే సినిమా హీరో నాగ శౌర్యతో అని ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు