విమర్శించిన వాళ్లు ఇకనైనా నోరు మూస్తారా.. నాగ్ మనస్సు బంగారం అంటూ?

టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన ముంబై ఎయిర్ పోర్ట్ ( Mumbai Airport ) నుంచి వస్తున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున తనతో సెల్ఫీలు తీసుకోవడం కోసం వచ్చారు.

అయితే ఎయిర్ పోర్ట్( Airport ) లో పనిచేస్తున్న ఓ సిబ్బంది నాగార్జునతో సెల్ఫీ తీసుకోవడానికి ముందుకు రాగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆయనని తోయడంతో ఒకసారిగా కింద పడబోయారు.ఇలా కింద పడుతున్న ఆ వ్యక్తిని తోటి సిబ్బంది పట్టుకున్నారు.

అయితే నాగార్జునకు తెలియకుండా ఈ విషయం జరగడంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నాగార్జున పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.అయితే ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ ఘటనపై స్పందించి సదరు అభిమానికి( Nagarjuna Fan ) క్షమాపణలు చెప్పడమే కాకుండా ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఈ విషయంలో తన సెక్యూరిటీ( Security ) చేసినది పూర్తిగా తప్పని క్షమాపణలు చెప్పారు.

Advertisement

ఇలా తన గురించి ఈ స్థాయిలో విమర్శలు రావడంతో తాజాగా అదే ఎయిర్ పోర్ట్ కి వెళ్లి నాగార్జున తన కారణంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ అభిమానిని దగ్గరికి తీసుకొని తనని పరామర్శించడమే కాకుండా ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోలపై నాగార్జున అభిమానులు స్పందిస్తూ విమర్శించిన వాళ్ళు ఇప్పటికైనా నోర్లు ముస్తారా నాగార్జున గారికి తెలియకుండా ఈ ఘటన జరిగింది.

కానీ ఆయన మనసు బంగారం అంటూ అభిమానులు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు