'దూత'గా మారిన చైతూ.. భయపెట్టడానికి రెడీ..!

కరోనా కు ముందు ఓటిటి ల బిజినెస్ ఎలా ఉన్న కరోనా తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.

ఎందుకంటే కరోనా సమయంలో థియేటర్స్ ఓపెన్ కాలేక పోవడంతో అందరు ఓటిటి ను ఆశ్రయించారు.

చాలా సినిమాలు కరోనా సమయంలో ఓటిటి లోనే రిలీజ్ అయ్యాయి.దీంతో ఓటిటి ల డిమాండ్ బాగా పెరిగింది.

ప్రెసెంట్ అందరి చూపు ఓటిటి లపైనే పడింది.ఓటిటీ లు కూడా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఓటిటి లను ఎక్కువగా ఇష్టపడడానికి మరొక కారణం కూడా ఉంది.ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని కుటుంబం మొత్తం కలిసి సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

Advertisement

ఇక ప్రేక్షకులు ఇప్పుడు ఓటిటి నే ఇష్టపడడంతో స్టార్స్ కూడా వీటిపైనే ద్రుష్టి పెట్టారు.ఇప్పటికే చాలా మంది స్టార్స్ ఓటిటి లో నటించడానికి మొగ్గు చూపుతున్నారు.

హీరో, హీరోయిన్స్ సైతం ఓటిటి లో నటించేందుకు వెనకడుగు వేయడం లేదు.

ఇటీవలే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్న చైతూ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.ప్రెసెంట్ ఈ అక్కినేని వారసుడు థాంక్యూ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

అలాగే బాలీవుడ్ డెబ్యూ లాల్ సింగ్ చద్దా సినిమాలో కూడా నటిస్తున్నాడు.వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ లో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఒక హర్రర్ కథతో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న వెబ్ సిరీస్ కి దూత అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు విక్రమ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలిపాడు.నాగ చైతన్య వెనుక నుండి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ దూత అనే టైటిల్ కన్ఫర్మ్ అయినట్టు తెలిపారు.

Advertisement

మరి హర్రర్ జోన్ లో చైతూ మొదటిసారి నటిస్తుండడంతో ఎలా ఉండబోతుందా అని అంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు