మోత్కూరు ఈనాడు రిపోర్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రెస్ క్లబ్

యాదాద్రి భువనగిరి జిల్లా:మోత్కూర్ మండల( Mothkur ) ఈనాడు రిపోర్టర్ ఎస్ఎన్.చారిపై మండలానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మోత్కూర్ ప్రెస్ క్లబ్( Press club ) ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ మోత్కూరు ఈనాడు రిపోర్టర్ 4 వైన్స్ షాపుల నుంచి రిపోర్టర్ల పేర్లు చెప్పి రూ.50 వేలు వసూలు చేశాడని,ఈ విషయంపై తమ సంస్థల యాజమాన్యానికి ఫిర్యాదులు వెళ్లడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,తమ ప్రమేయం లేకుండా తమ పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడి బద్నాం చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిని కోరారు.

Latest Video Uploads News