నా పాత్ర తీసేస్తారని అసలు ఊహించలేదు... కార్తీకదీపం మోనిత షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

ముఖ్యంగా ఈ సీరియల్ లో దీప, కార్తీక్, మోనిత పాత్రలకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.

ఈ సీరియల్లో ఈ ముగ్గురి పాత్రలను తీసేసి కథ కొనసాగించడంతో పెద్దగా రేటింగ్ రాకపోవడంతో తిరిగి ఈ ముగ్గురిని సీరియల్లోకి తీసుకువచ్చారు.ఇలా ఈ ముగ్గురు రీ ఎంట్రీ ఇవ్వడంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సీరియల్ నుంచి మోనిత పాత్రను తీసేసినట్టు వార్తలు వచ్చాయి.

ఇక ఈ వార్తలపై నటి మోనిత(శోభా శెట్టి) స్పందిస్తూ పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా శోభా శెట్టి మాట్లాడుతూ తాను కార్తీకదీపం సీరియల్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం షాపింగ్ మొత్తం చేసి రెడీగా పెట్టుకున్నానని వాళ్లు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

అయితే తనకు తెలియకుండా తన పాత్రను సీరియల్ నుంచి తప్పించారని ఈమె బాధపడ్డారు.తనని జైలుకు పంపించే విధంగా కథను రాసారని, జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అయిన నా పాత్ర ఉంటుందని ఆశించాను.

Advertisement

కానీ నా పాత్ర తొలగించినట్లు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని ఈమె తెలిపారు.కథ డిమాండ్ చేయడంతోనే తన పాత్రను తప్పించినట్టు వివరణ ఇచ్చారు.

కానీ ఆ విషయంలో ఏమాత్రం నిజం లేదని అర్థమవుతుంది.

ఇక ప్రస్తుతం కథలో మోనిత గురించి డాక్టర్ బాబుకు అన్నీ తెలిసిపోయాయి.కనుక ప్రస్తుతం నా పాత్రతో పనిలేదని, అందుకే నా ఫ్రెండ్ పాత్రలో చారుశీలను రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సీరియల్ కాస్త ఆసక్తికరంగా ఉందని అయితే కొంతకాలానికి తిరిగి నా పాత్ర ఎంట్రీ ఉండబోతుంది అంటూ ఈ సందర్భంగా శోభా శెట్టి చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

అయితే ఈమె గురించి మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈమె బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు కార్యక్రమంలో పాల్గొనబోతుందనీ మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లోకేష్ యూనివర్స్ కి రంగం సిద్ధం చేస్తున్న దర్శకుడు...మామూలుగా ఉండదు...
ఆ స్టార్ డైరెక్టర్ కథను సిద్ధు జొన్నలగడ్డ రిజెక్ట్ చేశారట.. అసలేం జరిగిందంటే?

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు