తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం పొందిన లిఖితను అభినందించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్( Telangana Sports School ) హాకీంపేటలో నాలుగవ తరగతి ప్రవేశం పొందిన బోయినపల్లి మండల కేంద్రం చెందిన మొగులూరు లిఖితను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ( Medipally Sathyam )అభినందించారు.

బోయిని పల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం నకు చెందిన విద్యార్థిని మొగులోజి లికిత ఎంపికైన ఇటీవల వెలువడిన ఫలితాలలో లిఖిత హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో అర్హత సాధించగా ఈ సందర్భం గా చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం అభినందిస్తూ 5000 నగదును అందజేసారం ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బిల్లా ఆనందం , ప్రిన్సిపాల్ చంద్రమౌళి, విద్యార్థిని తల్లిదండ్రులు మానస గంగా చారి ,బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ,ఎండి బాబు, నక్క శ్రీకాంత్ లు తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News