గుడివాడ: టిడిపి అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులపై ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు.కృష్ణాజిల్లా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
స్క్రాప్ బ్యాచ్ అంతా చేరి రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఆయన దగ్గర నుండి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడని ఎమ్మెల్యే కొడాలి నాని నాటి విషయాలను గుర్తు చేశారు.1999 ఎన్నికల్లో వాజ్ పాయ్ ను అడ్డం పెట్టుకుని గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు, ఆయన ఫోటోలను ఎక్కడ కనబడనివ్వలేదని, పార్టీ నాయకులు ఎవరైనా ఎన్టీఆర్ ఫోటోలను వినియోగిస్తే వారిని బెదిరించే పరిస్థితి ఉండేదన్నారు.ఇప్పుడు గతిలేక, రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహానాడు పేరుతో చంద్రబాబు చెప్పే ఆకర్షణీయమైన అబద్ధాలను, వెన్నుపోట్లను ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన అన్నారు.రాజకీయాలంటే బట్ట వ్యాపారమా, ఆకర్షణీయమైన మేనిఫెస్టో పేట్టడానికని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు.
చంద్రబాబు కుక్క బతుక్కు 2024 ఎన్నికల్లో చెప్పు దెబ్బ తప్పదని ఆయన అన్నారు.దేశమంతా తిరిగిన చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు ఎక్కడ ఉండడని, త్వరలో ఎన్టీఆర్ వారసులు చంద్రబాబు,లోకేష్ దగ్గర నుండి తెలుగుదేశం పార్టీని దక్కించుకుంటారని ఎమ్మెల్యే కొడాలి నాని జోస్యం చెప్పారు.
పప్పు లోకేష్ ఎద్దు మాదిరి రోడ్లమీద ఎందుకు తిరుగుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదని, పశువుల పాకలో ఉండాల్సిన అచ్చెం నాయుడు లాంటి వెధవలు జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని కొడాలి నాని హెచ్చరించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy