సెకండ్ తెలుగు మూవీకి ఒకే చెప్పిన గద్దలకొండ హీరోయిన్... త్వరలో గుడ్ న్యూస్

టిక్ టాక్ వీడియోలతో ఈ మధ్యకాలంలో చాలా మంది సోషల్ మీడియా స్టార్స్ గా మారిపోయారు.వారిలో కొందరు సినిమా అవకాశాలని కూడా అందుకుంటున్నారు.

అలాగే టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి తెలుగులోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన తమిళ్ బ్యూటీ మృణాళిని రవి.ఈ అమ్మడు వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గద్ధలకొండ గణేష్ మూవీలో హీరోయిన్ గా నటించింది.

వరుణ్ తేజ్ ని కాకుండా అధర్వ మురళీని ప్రేమించే అమ్మాయి పాత్రలో మృణాళిని రవి కనిపించి మంచి పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.అయితే పూజా హెగ్డే ఈ సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయినా మొత్తం క్రెడిట్ కొట్టుకుపోయింది.

ఇదిలా ఉంటే గద్దలకొండ మూవీతర్వాత మృణాళినికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.అయితే మాతృభాష తమిళంలో మాత్రం బిజీ ఆర్టిస్ట్ అయిపొయింది.

Advertisement

అక్కడ ఏకంగా విక్రమ్ కోబ్రా మూవీలో నటించింది.అలాగే విశాల్ ఎనిమి మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది.తెలుగు ప్రేక్షకుల అభిమానం ఒక రేంజ్ లో ఉంటుందని, వారి అభిమానం సొంతం చేసుకున్న తర్వాత దానిని ఎప్పటికి మరిచిపోలేం అని చెప్పింది.

తెలుగులో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నా అని, ప్రస్తుతం కొన్ని తెలుగు కథలు కూడా వినడం జరిగిందని చెప్పింది.వాటిలో కొన్ని ఫైనల్ అయ్యాయి.

త్వరలో దానికి సంబందించిన గుడ్ న్యూస్ మీతో పంచుకుంటా అని మృణాళిని చెప్పడం విశేషం.మొత్తానికి గద్దలకొండ గణేష్ మూవీతర్వాత నెక్స్ట్ తెలుగు సినిమాకి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు