అఫిషియల్ : మాస్ రాజాతో గోపీచంద్ మలినేని.. నాలుగోసారి కలిసిన మాసెస్ట్ కాంబో!

మాస్ మహారాజా రవితేజ - గోపీచంద్ మలినేని కాంబో మరోసారి అఫిషియల్ అయ్యింది.ఈ కాంబోలో మరో మూవీ రాబోతుంది అని అఫిషియల్ అప్డేట్ వచ్చేసింది.

గత కొద్దీ రోజులుగా ఈ కాంబోలో మరో మూవీ ఉంటుంది అని వార్తలు రాగా ఎట్టకేలకు ఈ రోజు అఫిషియల్ గా మేకర్స్ ఈ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడంతో ఇన్ని రోజుల ఉత్కంఠ ఈ రోజుతో తొలగిపోయింది.రవితేజ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంది.

ఈయన వరుసగా సినిమాలు ప్రకటిస్తూనే పోతున్నాడు.ఇక ఈ రోజు గోపీచంద్ మలినేనితో కొత్త మూవీ అనౌన్స్ చేసారు.

మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ థమన్ సంగీతం అందిస్తున్నట్టు కూడా ప్రకటించారు.అంతేకాదు మాసెస్ట్ కాంబో అంటూ పోస్టర్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

Advertisement

ఇక ఈ కాంబో ఇప్పటికే మూడుసార్లు రాగా మూడుసార్లు బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇక ఇప్పుడు క్రాక్ తర్వాత మరో సినిమాతో వీరు కలిసి పని చేయనున్నారు.ఇటీవలే గోపీచంద్ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోగా ఇప్పుడు రవితేజతో ఎలాంటి మూవీ తీస్తాడో వేచి చూడాలి.

ఇక రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు చేస్తుండగా ఈ మూవీ అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.ఇక ఇటీవలే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమా ప్రకటించాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.అలాగే దీంతో పాటు గోపీచంద్ మలినేని సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.

చూడాలి మరి షూట్ గురించిన అప్డేట్ ఎప్పుడు అందిస్తారో.

బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!
Advertisement

తాజా వార్తలు