ఎన్నికల వేళ ట్రంప్ కి బిగ్ షాక్..కోర్టులో కేసు నమోదు..!!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు కేవలం 30 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

గెలుపు కోసం ఇరు పార్టీల అభ్యర్ధులు, అభ్యర్ధుల మద్దతు దారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరో పక్క అభ్యర్ధులు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు రచిస్తున్నారు.ట్రంప్ ని ఎలాగైనా గద్దె దించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ట్రంప్ పై న్యూయార్క్ స్టేట్ కోర్టులో కేసు నమోదు అయ్యింది.

ఈ పరిణామంతో అమెరికా రాజకీయాలు మరింత వేడెక్కాయి.ఎన్నికలు ముంగిట్లో ఉన్న సమయంలో ట్రంప్ పై కేసు నమోదు కావడం ఒక పెద్ద చర్చ అయితే, ఆ కేసుని ట్రంప్ సొంత మేనకోడలు మేరీ ట్రంప్ వేయడం మరొక సంచలనంగా మారింది.

ఇంతకీ ఆమె ఎందుకు కేసు వేసింది అనే విషయంలోకి వెళ్తే.ట్రంప్ తనకి వారసత్వంగా రావాల్సిన ఆస్తిని తనకి ఇవ్వడంలేదని, నన్ను మోసం చేశారని ఆమె ప్రధాన ఆరోపణ.

Advertisement

ఈ కేసుకు సంభందించి ఆమె మాట్లాడుతూ తన తాత ఫ్రెడ్ ట్రంప్ కి చెందిన ఎస్టేట్ లో తనకి కూడా వాటా ఉందని కానీ ఆ వాటా తనకి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆమె వాదిస్తోంది.తనకి రావాల్సిన ఆస్తి మొత్తంగా 10 లక్షల డాలర్లు ఉంటుందని.

నా తాత ఆస్తి నాకు దక్కకుండా ట్రంప్ ఆయన సోదరి మేరీ అన్నే బ్యారీ సోదరుడు, రాబర్ట్ ట్రంప్ మోసం చేశారని ఆమె పిటిషన్ లో పేర్కొంది.ఇదిలాఉంటే మేరీ ట్రంప్ వేసిన పిటిషన్ పై స్పందిచడానికి ట్రంప్ కానీ ఆయన కుటుంభ సభ్యులు, లాయర్లు ఎవరూ స్పందించడం లేదు.

అయితే ఎన్నికల వేళ ఊహించని విధంగా మేరీ ట్రంప్ ఇలా కోర్టుకు ఎక్కడంపై సర్వాత్రా విమర్శలు రేగుతున్నాయి.ట్రంప్ పై డెమోక్రాట్లు ఆడుతున్న కుట్రలో భాగమేనని, మేరీ ట్రంప్ డెమొక్రాట్ల మాయలో పడకపోవడం మంచిదని అంటున్నారు ట్రంప్ మద్దతుదారులు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు