Malavika Mohan : పవన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్.. ఆ వార్తల్లో నిజం లేదంటూ?

మాళవిక మోహనన్‌( Malavika Mohanan ) గురించి మనందరికీ తెలిసిందే.మాళవిక మోహన్ తక్కువ సినిమాలలో నటించినప్పటికీ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

ఈమె ఎక్కువగా హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది.తరచూ ఏదో ఒక విషయంపై వార్తలో నిలుస్తూ ఉంటుంది మాళవిక మోహనన్‌.

ఇది ఇలా ఉంటే తరచూ ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.కదా మొన్నటి వరకు ఈమె ప్రభాస్( Prabhas ) తో సినిమా చేయబోతోంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే గత రెండు మూడు రోజులుగా మాళవిక మోహనన్‌ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో సినిమా చేయబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో పూజా హెగ్డే మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా సెకండ్‌ హీరోయిన్‌గా శ్రీలీల ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే కంఫర్మ్ అంటూ కూడా వార్తలు వినిపించాయి.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా మాళవిక మోహనన్‌ పేరు కూడా వినిపిస్తోంది.

పూజా హెగ్డే కి బదులుగా మాళవిక మోహనన్‌ మెయిన్ హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వార్తలు జోరుగా వినిపించగా ఆ విషయంపై తాజాగా రియాక్ట్ అయ్యింది మాళవిక మోహనన్‌.సందర్భంగా ఆమె ట్విట్టర్‌ ద్వారా ఆమె స్పందిస్తూ, అందులో నిజం లేదని తెలిపింది.పవన్‌ కళ్యాణ్‌ తో నటించాలని తనకు ఉందని, కానీ ఈ వార్త వాస్తవం కాదని ఆమె తెలిపింది.

పవన్‌ కళ్యాణ్‌ సర్‌పై చాలా అభిమానం ఉంది.కానీ నేను ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం లేదు.

ప్రస్తుతం ఒక అద్భుతమైన తెలుగు సినిమాలో నటిస్తున్నాను.అందులో మెయిన్‌ లీడ్‌గా చేస్తున్నాను సెకండ్‌ హీరోయిన్‌ కాదు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇది నా తొలి తెలుగు సినిమా.ఈ ప్రాజెక్ట్ తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను అని తెలిపింది మాళవిక మోహనన్‌.

Advertisement

అయితే కొద్ది రోజులుగా ప్రభాస్ తో మాళవిక మోహనన్‌ సినిమా చేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ అద్భుతమైన సినిమా చేస్తున్నానని చెప్పింది.

అది ప్రభాస్‌ దే అని వేరే చెప్పక్కర్లేదు.అంతేకాదు, అందులో తాను సెకండ్‌ హీరోయిన్‌ కాదని మెయిన్‌ లీడ్‌గానే చేస్తున్నట్టు వెల్లడించింది.

తాజా వార్తలు