నిద్రలో కూడా పబ్ జీనే కలవరిస్తున్న ధోని... భార్య కంప్లైంట్

టీంఇండియా క్రికెట్ కి స్వర్గయుగంగా ధోని కెప్తెన్సీ గురించి చెప్పుకుంటారు.

మిస్టర్ కూల్ గా ఇండియాకి క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన విజయాల్ని తన కెప్తెన్సీతో ధోని అధించాడు.

టీం ఇండియాకి అద్భుతమైన కీపర్ గా కూడా సేవలు అందించాడు.టెస్ట్ లకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని టీ-20, వన్డేలలో కొనసాగుతున్నాడు.

అయితే ఫిట్ నెస్ కారణంగా కొంత కాలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఇక ధోని కెరియర్ మీద పూర్తిగా నీలి నీడలు కమ్ముకున్నాయి.

అతను తిరిగి జట్టులోకి రావడం కష్టమే అని మాజీలు అంటున్నారు.ఇక ధోని కూడా ఇవేమీ ఆలోచించకుండా ఫ్యామిలీతో, తన కూతురుతో ఎక్కువ టైం కాలక్షేపం చేస్తున్నాడు.

Advertisement

మరోవైపు లాక్ డౌన్ కారణంగా క్రికెట్ మ్యాచ్ లు లేకపోవడంతో ఇంటికే పరిమితం అయ్యి ఉన్న మిస్టర్ కూల్ తన కూతురుతో, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడు.అయితే ధోని మీద అతని భార్య సాక్షి కంప్లైంట్ ఇస్తుంది.

అతని గురించి ఆసక్తికరమైన పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టింది.తన భర్త పబ్ జీ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడని ధోని భార్య సాక్షి చెప్పింది.

నా భర్త పబ్‌జీకి దాసోహం అయ్యాడు.ఎంతలా అంటే నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నాడని చెప్పింది.

దేశంలో టీనేజ్ యువతకి వ్యసనంగా మారిపోయిన పబ్ జీ గేమ్ ని ధోని కూడా అలవాటుగా మార్చేసుకున్నాడని దీని బట్టి తెలుస్తుంది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు