ఇద్దరు హీరోలను లైన్‌లో పెట్టిన మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీ ‘సర్కారు వారి పాట’ను లైన్‌లో పెట్టేందుకు మహేష్ రెడీ అయ్యాడు.

కాగా ఇటు హీరోగా ఉంటున్న మహేష్, నిర్మాతగా కూడా మారి వరుసగా సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే యంగ్ హీరో అడవి శేష్‌తో ‘మేజర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ముంబై దాడుల్లో మృతి చెందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాధ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను మహేష్ నిర్మిస్తున్నాడు.ఇప్పుటికే మెజారిటీ శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

కాగా మరో యంగ్ హీరో శర్వానంద్‌తో కూడా మహేష్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఓ డైరెక్టర్ చెప్పిన అద్భుతమైన కథకు మహేష్ పచ్చజెండా ఊపగా, అందులో హీరోగా శర్వానంద్ నటించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది.మొత్తానికి హీరోగానే కాకుండా నిర్మాతగా మారిన మహేష్ ఇలా వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందించాలనే ప్రయత్నం చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహేష్ నటించనున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేయనున్నాడు.

Advertisement

తాజా వార్తలు