మహేష్ 27 స్టోరీ లీక్.. ఏమిటో ఈ పుకార్లు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు మహేష్.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని వంశీ పైడిపల్లితో చేస్తాడని అందరూ అనుకున్నారు.కానీ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

దీంతో వంశీతో సినిమాను మహేష్ పక్కనబెట్టాడని, తన నెక్ట్స్ మూవీని పరశురాంతో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమా దాదాపు ఖరారు అయ్యిందని, దీని కోసం పరశురాం అదిరిపోయే స్క్రిప్టును కూడా రెడీ చేశాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి.

వైట్ కాలర్ మోసాలను ఈ సినిమాలో ప్రధాన అంశంగా చూపిస్తారట.దేశానికి చెందిన బిజినెస్ టైకూన్స్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీల తరహా మోసాలను ఇందులో బట్టబయలు చేస్తారట.

Advertisement

ఈ మోసాల నుండి దేశాన్ని హీరో ఎలా కాపాడన్నది కథ అని తెలుస్తోంది.మొత్తానికి ఈసారి కూడా ఓ సోషల్ మెసేజ్‌ను జనాలకు చూపించేందుకే మహేష్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ కాకముందే ఇలాంటి వార్తలు రావడం ఏమిటని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు