'కేజిఎఫ్' మరో సెన్సేషన్.. రికార్డ్ థియేటర్స్ లో 50 రోజులు రన్!

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.

కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 చేసాడు.

రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.

ఏప్రిల్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.రిలీజ్ అయినా అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.

దీంతో ఇప్పుడు కేజిఎఫ్ మ్యానియా దేశాన్ని ఊపేస్తోంది అనే చెప్పాలి.పార్ట్ 1 ను మించి సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.

Advertisement

దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏకంగా 1100 కోట్లు వసూళ్ల ను అందు కున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

ఇండియాస్ టాప్ 3 సినిమాగా నిలిచింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు మరొక ఘనత సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్ లలో సెన్సేషన్ రన్ ను కొనసాగిస్తుంది.ఇక ఇప్పుడు 50 రోజుల వేడుకకి చేరుకో బోతుంది.

ఈ సినిమా మొత్తం ఇండియా వైడ్ గా 390 కి పైగా థియేటర్ లలో 50 రోజుల మైల్ స్టోన్ ను పూర్తి చేసుకుంది.అలాగే ఓవర్సీస్ లో సైతం 10 థియేటర్ లలో ఈ రికార్డ్ నెలకొల్పింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఈ మధ్య కాలంలో 50 రోజుల పాటు ఇన్ని థియేటర్ లలో రన్ ను కొనసాగించడం రికార్డ్ అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు