పవర్ స్టార్ తో మరో సారి జత కడుతున్న మహానటి

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న భామ కీర్తి సురేష్.

కేవలం మూడో సినిమాతోనే సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందరిని మెప్పించిన కీర్తి సురేష్ రెండేళ్ళు తెలుగు సినిమాలకి గ్యాప్ ఇచ్చింది.

మరల ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది.ప్రస్తుతం ఆమె తెలుగులో మిస్ ఇండియా అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇక ఆమె నితిన్ కి జోడీగా రంగ్ దే అనే సినిమా చేస్తుంది.ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

మరో వైపు పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని ఈ అమ్మడు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా కీర్తి సురేష్ పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే కీర్తి అజ్నాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించింది.

అయితే ఆ సినిమాలో వీరి కాంబినేషన్ భాగానే ఉన్న సినిమా డిజాస్టర్ కావడంతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు.అయితే హరీష్ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర అద్భుతంగా ఉంటుందని టాక్ నడుస్తుంది.

పవన్ కళ్యాణ్ కూడా హీరోయిన్ గా కీర్తి సురేష్ కి ఓటు వేసినట్లు చెప్పుకుంటున్నారు.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు